గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
తెలంగాణ ములుగు మార్చి 26 (హిం.స)కుటుంబ కలహాలతో గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు
గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్య


తెలంగాణ ములుగు మార్చి 26 (హిం.స)కుటుంబ కలహాలతో గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారంలో మంగళవారం జరిగింది.

ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన కుమ్మరి మణికుమార్ (22) ఇటివల ఓ యువతిని ప్రేమవివాహం చేసుకున్నాడు. కాగా తరచూ భార్యాభర్తల మధ్యగొడవలు జరిగేవి. ఈ క్రమంలో గొడవ జరగగా మనస్థాపానికి గురై మణి కుమార్ గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు ములుగు ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande