తెలంగాణ ములుగు మార్చి 26 (హిం.స)కుటుంబ కలహాలతో గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారంలో మంగళవారం జరిగింది.
ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన కుమ్మరి మణికుమార్ (22) ఇటివల ఓ యువతిని ప్రేమవివాహం చేసుకున్నాడు. కాగా తరచూ భార్యాభర్తల మధ్యగొడవలు జరిగేవి. ఈ క్రమంలో గొడవ జరగగా మనస్థాపానికి గురై మణి కుమార్ గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు ములుగు ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం