తెలంగాణ: బిజినెస్: మార్చ్ 28 (హిం.స)
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్ రాణించడంతో దేశీయంగా భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. గురువారం మధ్యాహ్నం సెన్సెక్స్ 900కి పైగా పాయింట్ల లాభంతో 73,902 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 284 పాయింట్ల లాభంతో 22,412 ఎగువన కొనసాగుతోంది. కాగా ఈ ఆర్థిక సంవత్సరానికి ఇదే చివరి ట్రేడింగ్ సెషన్ కూడా కావడం గమనార్హం.
సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం