ఫిలిబిత్ ప్రజలకు ఎంపీ వరుణ్ గాంధీ లేఖ
ఢిల్లీ : 28మార్చ్ ( హింస) ఫిలిబిత్ ప్రజలను ఉద్దేశించి ఫిలిబిత్ ఎంపీ వరుణ్ గాంధీ లేఖ రాశారు. ఫిలిబి
.....


ఢిల్లీ : 28మార్చ్ ( హింస) ఫిలిబిత్ ప్రజలను ఉద్దేశించి ఫిలిబిత్ ఎంపీ వరుణ్ గాంధీ లేఖ రాశారు. ఫిలిబిత్తో తన సంబంధం రాజకీయాలకు అతీతమైందని, ఫిలిబిత్ బిడ్డనైన తాను ప్రజల కోసం ఎంతటి మూల్యాన్ని చెల్లించేందుకూ సిద్ధమని ప్రకటించారు.సామాన్యుడి గొంతు వినిపించేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజల కోసం తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచేఉంటాయని స్పష్టం చేశారు. ఇవాళ తాను ప్రజల కోసం చేసే పనులను కొనసాగించేందుకు వారి ఆశీస్సులు కోరుతున్నానని అన్నారు. 1983లో మూడేండ్ల వయసులో తాను తల్లి వేలు పట్టుకుని ఫిలిబిత్ గడ్డపై అడుగుపెట్టానని, ఇప్పుడు ఇదే తన కార్యస్ధలమైందని, ఇక్కడి ప్రజలు తన కుటుంబంలో భాగమయ్యారని, ఈ విషయాలన్నీ తనకు గుర్తుకువస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande