మనీలాండరింగ్ కేసులో కేజ్రీ వాల్ కు భారీ ఊరట
ఢిల్లీ: మార్చ్ 28 (హిం.స) మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్కు భారీ ఊరట లభించింది. ఈ
మనీలాండరింగ్ కేసులో కేజ్రీ వాల్ కు భారీ ఊరట


ఢిల్లీ: మార్చ్ 28 (హిం.స) మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్కు భారీ ఊరట లభించింది. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ను ముఖ్యమంత్రిగా తొలగించాలని దాఖలైన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని పేర్కొన్న హైకోర్టు.. అందుకు న్యాయపరంగా ఉన్న అడ్డంకులు ఏంటని ప్రశ్నించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ మేరకు గురువారం తీర్పునిచ్చింది.

మద్యం కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకపోవడంతో.. సుర్జీత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి ఆయన్ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులొ ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనిని గురువారం విచారించిన ధర్మాసనం.. ప్రభుత్వాలకు సంబంధించిన పాలనాపరమైన విషయాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ విషయం న్యాయపరమైన జోక్యం పరిధికి వెలుపల ఉందని తెలిపింది. ప్రాక్టికల్ ఇబ్బందులు ఉండొచ్చేమో కానీ, సీఎంగా కొనసాగడానికి ఉన్న న్యాయపరమైన అడ్డంకి ఏంటని కోర్టు పిటిషనర్ను ప్రశ్నించింది.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచార్


 rajesh pande