తెలంగాణ: హైదరాబాద్: మార్చి 29 (హిం.స) భారత రాష్ట్ర సమితి పార్టీ నుండి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న కేశవరావు తమ అభిప్రాయాలను తెలియజేశారు.
తీర్థ యాత్రలకు వెళ్లిన వారు ఎప్పటికైనా ఇంటికే చేరుతారు.... అలాగే
నేను కూడా నా సొంత ఇల్లు కాంగ్రెస్ లో తిరిగి చేరనున్నాను.
53 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో పని చేశాను...
బిఆర్ఎస్ లో నేను పని చేసింది కేవలం పదేళ్లు మాత్రమే...
తెలంగాణ కోసమే బిఆర్ఎస్ లో చేరిన....
కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇచ్చింది....
నేను మొదటిసారి కాంగ్రెస్ రెండో ప్రాధాన్యత ఓట్లతోనే రాజ్యసభకు ఎన్నికయ్యా...
నేను పుట్టింది, పెరిగింది, కాంగ్రెస్ లోనే....
ఆ పార్టీలోనే చనిపోవాలని అనుకుంటున్న...
నేను బిఆర్ఎస్ కు ఇంకా రిజైన్ చేయలేదు...
నా కూతురు చేరిన రోజు నేను కాంగ్రెస్ లో చేరడం లేదు...
ఏ రోజు కాంగ్రెస్లో చేరేది తేదీ ఖరారు అయిన తర్వాత చెబుతా..
నా కుమారుడు మాత్రం బిఆర్ఎస్ లోనే ఉండాలి అనుకుంటున్నారు....
ఇంద్రకరణ్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు....
సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం