తెలంగాణ మార్చి 29 (హిం.స)తెలంగాణ రాష్ట్రంలో భారతీయ రాష్ట్ర సమితి పార్టీ చరిత్ర ఇకముగిసిన అధ్యాయమే అని మంత్రి
ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో ఆయన శుక్రవారం ప్రస్తుత తెలంగాణ రాజకీయాలపై మీడియాతో మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకమే అని ఉత్తమ్ తెలిపారు. తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు బీజేపీకి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో మోడీకి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఎంపీ ఎన్నికల్లో 13, 14 స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
సంపత్ రావు హిందుస్తాన్ సమాచారం