నంద్యాల:29 మార్చ్ (హిం.స) తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో భాగంగా శుక్రవారం నంద్యాల జిల్లా, బనగానపల్లెలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
ముందు బనగానపల్లెలో చంద్రబాబు రోడ్ షో జరుగుతుంది. అనంతరం పెట్రోల్ బంకు సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు సభకు జిల్లా నేతలు అన్నీ ఏర్పాట్లు చేశారు. బనగానపల్లె మొత్తం పసుపు మయమైంది.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్