అమరావతి:29 మార్చ్ (హిం.స) వైసీపీ తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది.
వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న రాజ్యలక్ష్మితో పాటు గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, ఏలూరు జిల్లా కలెక్టర్, ఆర్డీవో, బుట్టాయిగూడెం తహశీల్దార్లకు నోటీసులు జారీ చేసింది.
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 25కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్