తెదేపా.అభ్యర్ధుల తుది జాబితా ప్రకటన
అమరావతి: 29 మార్చ్ (హిం.స)అభ్యర్థుల తుది జాబితాను తెదేపా ప్రకటించింది. పెండింగ్లో ఉన్న 9 అసెంబ్లీ, 4
tdp


tdp


tdp


tdp


tdp


tdp


tdp


tdp


tdp


tdp


tdp


tdp


tdp


tdp


tdp


tdp


tdp


tdp


అమరావతి: 29 మార్చ్ (హిం.స)అభ్యర్థుల తుది జాబితాను తెదేపా ప్రకటించింది. పెండింగ్లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలను వెల్లడించింది. సందిగ్ధంలో ఉన్న చీపురుపల్లి, భీమిలి సహా మిగిలిన స్థానాలకూ అభ్యర్థులను ఖరారు చేసింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి పోటీ చేయనున్నారు. చీపురుపల్లికి ఆయన పేరు పరిశీలించినా.. చివరికి గతంలో పోటీ చేసిన భీమిలినే కేటాయించారు. కదిరి స్థానంలో అభ్యర్థిని తెదేపా మార్చింది. అక్కడ కందికుంట యశోద పేరును తొలుత ప్రకటించగా.. ఇప్పుడు ఆ స్థానంలో ఆమె భర్త, మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్కు టికెట్ ఇచ్చింది.

సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు, కలిశెట్టి అప్పలనాయుడు ఎచ్చెర్ల స్థానాన్ని ఆశించారు. పొత్తులో భాగంగా ఆ సీటు భాజపాకు కేటాయించారు. దీంతో ఆ ఇద్దరు నేతలకు వేరే చోట అవకాశం కల్పించింది. చీపురుపల్లి అభ్యర్థిగా కళా వెంకట్రావు, విజయనగరం లోక్సభకు కలిశెట్టి అప్పలనాయుడును ఆ పార్టీ బరిలో నిలిపింది.

హిందూస్తాన్ సమాచార రాజీవ్


 rajesh pande