నెల్లూరు: 29 మార్చ్ (హిం.స)వంద రూపాయిలిస్తాం.. రెండు వందలు ఇస్తామని చెప్పి బలవంతంగా వైసీపీ సభ (YSRCP) కు తీసుకువచ్చిన జనాలు 10 నిముషాలు కూడా ఉండడంలేదు. అసలే ఎండాకాలం... వైసీపీ ప్రభుత్వంపై పీకల వరకు కోపం.. ఈ దరిద్రం ఎప్పుడు పోతుందిరా బాబూ అంటూ వెయ్యి కళ్లతో చూస్తున్న తరుణంలో ఎంత పెద్దాయన వచ్చినా జనం వింటారా? వినరు. ఎందుకంటే వాళ్లకు ఏం కావాలో ఎప్పుడో నిర్ణయించుకున్నారు. నెల్లూరు )లో విజయసాయిరెడ్డి ప్రచారం చేస్తుండగా ఈ చేదు అనుభవం ఎదురైంది. సభలో విజయసాయి ప్రసంగం మొదలుపెట్టగానే జనాలు వెళ్లిపోయారు. వారిని ఆపేందుకు స్థానిక నేతలు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అందరికీ భోజనాలు ఉన్నాయి.. టిఫిన్లు ఉన్నాయని చెప్పినా ఎవరూ రాలేదు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్