రాజమహేంద్రవరం, ,29 మార్చి(హిం.స) అనపర్తి నియోజకవర్గంలో టీడీపీ ఉనికి లేకుండా చేయాలనే దురుద్దేశంతో వైసీపీ కుట్రకు తెరలేపిందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
ఇందుకోసం రూ.18 కోట్ల నుంచి రూ.20 కోట్లు చేతులు మారినట్లు సమాచారం ఉందన్నారు. అనపర్తి స్థానాన్ని భాజపాకు కేటాయించడంతో రామవరంలోని తన నివాసంలో గురువారం కార్యకర్తలతో సమావేశమయ్యారు.
నియోజకవర్గంలో వైసీపీ అరాచకాలను ఎదుర్కొంటూ పార్టీని విజయం దిశగా తీసుకెళుతున్నామని, ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంపై అధినేత చంద్రబాబు, లోకేశ్ పునరాలోచన చేయాలని కోరారు. ఈ స్థానం నుంచి తెదేపా అభ్యర్థి బరిలో లేకపోతే ఆ ప్రభావం పార్లమెంట్ స్థానంపైనా ఉంటుందన్నారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్