హైదరాబాద్/అమరావతి, 16 ఏప్రిల్ (హిం.స): తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఎన్నికల రణరంగంలో అసలు సిసలు ఘట్టం నామినేషన్ల పర్వం. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 18వ తేదీన ఈ పర్వం ప్రారంభం కానుంది. ఆ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్దమవుతున్నారు. అందుకోసం తమ అనుచర గణాన్ని సిద్దం చేసుకుంటున్నారు.
నామినేషన్లు వేసేందుకు భారీ ర్యాలీగా వెళ్లేందుకు ఆయా అభ్యర్థులు.. సమాయత్తమవుతున్నారు. ఏప్రిల్ 18వ తేదీన నామినేషన్లు స్వీకరణ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 25వ తేదీ నామినేషన్లు స్వీకరణకు ఆఖరు తేదీ. ఏప్రిల్ 26వ తేదీ నామినేషన్లను పరిశీలిస్తారు. ఏప్రిల్ 29వ తేదీ నామినేషన్లు ఉప సంహరించుకొనేందుకు చివరి రోజు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్