అమరావతి 16 ఏప్రిల్ *హిం.స)ఏపీ సీఎం జగన్పై రాయితో దాడి జరగడంపై రాజకీయ రచ్చ కొనసాగుతూనే ఉంది. రాయి విసిరిన వ్యక్తిని పోలీసులు గుర్తించారనే ప్రచారం జరగుుతున్నా.. అధికారికంగా పోలీసులు ఎటువంటి ప్రకటన చేయలేదు. నిందితులను గుర్తించేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో జగన్పై దాడి చేసిన వారి ఆచూకీ తెలియజేస్తే రూ.2లక్షలు పారితోషికం ఇస్తామంటూ విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ చేసిన ప్రకటనపై నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి స్పందించారు. దీనికి సంబంధించి ఓ వీడియో రిలీజ్ చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగన్పై దాడి చేసింందెవరో ఎవరికి తెలియదని, తనకు మాత్రమే తెలుసన్నారు. తనకు పేర్లతో సహా తెలుసని.. అయితే 2లక్షల రూపాయిల పారితోషికం తనకు అవసరం లేదన్నారు. మరోవైపు ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు జగన్కు ఎటువంటి గాయం కాకూడదని, తనపై ఎలాంటి దాడులు జరగకూడదని భగవంతుడిని ప్రార్థించారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్