అమరావతి: 16 ఏప్రిల్ (హిం.స)ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన దళిత యువకుల శిరోముండనం కేసుకు సంబంధించి ఎట్టకేలకు తీర్పు విడుదలైంది. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తుల (Thota Trimurthulu) కు విశాఖపట్నం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి 18 నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఈ విషయంపై మాజీ మంత్రి కే ఎస్. జవహర్ (KS Jawahar) కీలక వ్యాఖ్యలు చేశారు. 1996లో నేరం చేసిన తోట త్రిమూర్తులకు నేడు శిక్ష పడిందని చెప్పారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్