శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి.కిషన్ రెడ్డి గారి సందేశం
హైదరాబాద్17,,ఏప్రిల్ (హిం.స) అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు,ఆదర్శ వ్యక్తిత్వం, మర్యాదా పురుషోత్తము
శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి.కిషన్ రెడ్డి గారి సందేశం


హైదరాబాద్17,,ఏప్రిల్ (హిం.స) అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు,ఆదర్శ వ్యక్తిత్వం, మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముని జీవితం భారతీయులందరికీ ఆదర్శం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా.. ధర్మాన్ని నిక్కచ్చిగా పాటించడం శ్రీరామచంద్రుని జీవితం నుంచి మనకు లభించే అతిముఖ్యమైన పాఠం. ఈ ఆదర్శాన్ని మనకు గుర్తుచేసే పండగే శ్రీరామ నవమి.

రాముడి ఆదర్శాల ఆధారంగా ముందుకు నడుస్తున్న భారతదేశంలో.. రాముడు పుట్టినచోట గుడి ఉండాలన్న సంకల్ప సాధనలో 500 ఏళ్ల స్వప్నాన్ని సాకారం చేసుకుంటూ.. మనందరి సహకారంతో బ్రహ్మాండమైన మందిరాన్ని అయోధ్యలో నిర్మించుకున్నాం. ఈ ఏడాది జనవరి 22న ఘనంగా ప్రాణపతిష్ట కూడా చేసుకున్నాం. ఇకపై అయోధ్య రామాలయం మనకు నిత్య స్ఫూర్తి కేంద్రం.

రామ మందిర చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్న మనం.. రాముడి ఆదర్శాల స్థాపన విషయంలోనూ బాధ్యతతో కలిసి ముందుకెళ్దాం. భారతదేశాన్ని విశ్వగురు చేసే లక్ష్యంతో జరుగుతున్న మహత్కార్యానికి అండగా నిలుద్దాం. వచ్చే నెలలో (మే-13న) జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లోనూ ధర్మానికి అండగా నిలుద్దాం. రామరాజ్య స్థాపనలో భాగస్వాములమవుదాం.

రావణ సంహారం తర్వాత లక్ష్మణుడి సందేహానికి రాముడు సమాధానమిస్తూ చెప్పిన ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ మాటను.. వాస్తవరూపంలోకి తీసుకొచ్చి అభివృద్ధి,సంక్షేమానికి సమ ప్రాధాన్యతనిస్తూ అన్నిరంగాల్లో దేశాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారికి సంపూర్ణ మద్దతును తెలియజేద్దాం.

శ్రీరామ నవమి పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆయురారోగ్యాలను, సుఖశాంతులను, సమృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షిస్తూ.. మరోసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande