జగన్ బస్సు యాత్ర విజయవంతం: ధర్మాన కృష్ణదాస్
శ్రీకాకుళం(ఆంధ్రప్రదేశ్), ఏప్రిల్ 25(హిం.స): శ్రీకాకుళం జిల్లాలో బుధవారం జరిగిన సీఎం వైఎస్ జగన్ మేమ
జగన్ బస్సు యాత్ర విజయవంతం: ధర్మాన కృష్ణదాస్


శ్రీకాకుళం(ఆంధ్రప్రదేశ్), ఏప్రిల్ 25(హిం.స): శ్రీకాకుళం జిల్లాలో బుధవారం జరిగిన సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా జననేత జగన్ పర్యటనని జయప్రదం చేశారని తెలిపారు. వైసీపీ లోని అన్ని విభాగాల ప్రతినిధులు ఇందులో చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు. ఇదే స్ఫూర్తితో జిల్లాలో ఈ ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

- కృష్ణమూర్తి, హిందూస్తాన్ సమాచార్.


 rajesh pande