మలేరియా దినోత్సవ ర్యాలీ ప్రారంభించిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ బి వెంకటేశ్వరరావు
తెలంగాణ రంగా రెడ్డి షాద్ నగర్ ఏప్రిల్:25(హిం స) ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా గురువారం షాద్ నగ
మలేరియా దినోత్సవ ర్యాలీ ప్రారంభించిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ బి వెంకటేశ్వరరావు


తెలంగాణ రంగా రెడ్డి షాద్ నగర్ ఏప్రిల్:25(హిం స) ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా గురువారం షాద్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుండి పట్టణ ముఖ్య కూడలి వరకు వైద్య సిబ్బంది ర్యాలీని నిర్వచించారు. ఈ ర్యాలీ ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ బి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ ర్యాలీ లో మలేరియా నిర్మూలన కు సంబంధించిన మలేరియా స్లొగన్స్ చెబుతూ , ర్యాలీ చౌరస్తాలో మలేరియా నివారణ కార్యక్రమాల గురించి నినాదాలు చేశారు.

అనంతరం ఫరూఖ్ నగర్ ఎంపీడీవో ఆఫీసులో షాద్ నగర్ డివిజన్ లోని వైద్యాధికారులకు , హెల్త్ సూపర్వైజర్లకు, ఎం ఎల్ హెచ్ పి వైద్య అధికారులకు, ఏఎన్ఎం, ఆశలకు మలేరియా పైన జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, జిల్లా మలేరియా డాక్టర్ రాకేష్, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ విజయలక్ష్మి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, రంగారెడ్డి జిల్లా మలేరియా ఆఫీసు సిబ్బంది, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.

జనార్థన్ రెడ్డి రంగా రెడ్డి జిల్లా హిందుస్థాన్ సమాచార్


 rajesh pande