హైదరాబాదు 27 ఏప్రిల్ (హిం.స)వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. ఇక ప్రయాణాలను మనం ఊహించగలమా..? అందుకే దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను గణనీయంగా పెంచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దానాపూర్కు 22 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. సికింద్రాబాద్ నుంచి 11 రైళ్లు వెళ్తున్నాయి. ఇవన్నీ ప్రతి గురువారం నగరం నుంచి బయలుదేరుతున్నాయి. అలాగే అటునుంచి ఇంతే సంఖ్యలో ప్రతి శనివారం తిరుగు ప్రయాణమవుతున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలను కలుపుతూ వెళ్లే ఈ రైళ్లన్నీ అన్రిజర్వ్డ్. ప్రతి రోజూ నడిచే సికింద్రాబాద్ - దానాపూర్ ఎక్స్ప్రెస్లో వెయిటింగ్ లిస్ట్ జాబితా ఉన్నందున క్లోనింగ్ రైళ్లు మాదిరి వీటిని నడుపుతున్నారు. ఇదే రైలులో అయోధ్యకు వెళ్లే భక్తులు కూడా తోడయ్యారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్