అమరావతి 27 ఏప్రిల్ (హిం.స)అధికార మదం తలకెక్కిన కొందరు వైసీపీ నేతలకు కన్నూమిన్నూ కనిపించడం లేదు. భక్తితో మొక్కాల్సిన దేవుడన్నా, ఆయనకు సేవ చేసేవారన్నా అమితమైన ద్వేషం పెంచుకొని వారిపట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు.
దైవ సన్నిధిలో విజ్ఞతతో మెలగాలన్న కనీసం జ్ఞానం కూడా లేకుండా భక్తుల ఎదుటే బూతుపురాణం ఎత్తుకుంటూ, అర్చకులు, పురోహితులపై విచక్షణ మరిచి రౌడీల్లా దాడులకు తెగబడి, వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారు.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన నాటినుంచీ ఈ తరహా ఘటనలు తరచూ జరుగుతునే ఉన్నాయి. ఆయా సందర్భాల్లో అర్చకులు, పురోహితులు, హిందూ సంఘాలు రోడ్డెక్కి నిరసనలు తెలిపినా అధికార పార్టీ నేతల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్