బాలానగర్లో వాహనాల తనిఖీ.. రూపాయలు 10:50 లక్షలు పట్టుకున్న పోలీసులు
తెలంగాణ: హైదరాబాద్; ఏప్రిల్ 9 (హిం.స) లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఓటర్లకు డబ్బు, ఇతర వస్తువులతో
బాలానగర్లో వాహనాల తనిఖీ.. రూపాయలు 10:50 లక్షలు పట్టుకున్న పోలీసులు


తెలంగాణ: హైదరాబాద్; ఏప్రిల్ 9 (హిం.స)

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఓటర్లకు డబ్బు, ఇతర వస్తువులతో తాయిలాల ఆశ చూపి ఓట్లు రాబట్టేందుకు పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. అయితే, వాటన్నింటికీ అడ్డుకట్ట వేసేందుకు ఆయా రాష్ట్రాల్లో పోలీసులు ప్రధాన కూడళ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, టోల్ గేట్ల వద్ద విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ హైదరాబాద్లో బాలనగర్ పరిధిలో వాహనాల తనిఖీలు నిర్వహించారు.

ఓ కారులో అక్రమంగా రూ. 10.50లక్షల నగదును తరలిస్తుండగా పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. కారులోని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు ఎవరికీ చెందిందనని ఆ ముగ్గురి వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande