మహిళల సాధికారత పైనే దేశ బలం ఆధారపడి ఉంటుంది.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మ్.
న్యూఢిల్లీ, 16 సెప్టెంబర్ (హి.స.) మహిళల సాధికారతపైనే దేశబలం ఆధారపడి ఉంటుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సీఎన్ఎన్- న్యూస్18 షీశక్తి 2024 కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. “మన దేశంలో మహిళలు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎప్పుడూ ధైర్యం, శక్తి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము


న్యూఢిల్లీ, 16 సెప్టెంబర్ (హి.స.)

మహిళల సాధికారతపైనే దేశబలం ఆధారపడి ఉంటుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సీఎన్ఎన్- న్యూస్18 షీశక్తి 2024 కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. “మన దేశంలో మహిళలు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎప్పుడూ ధైర్యం, శక్తి ప్రదర్శిస్తూ ముందడుగు వేస్తున్నారు. ఆడవారి భద్రతకు సంబంధించి దురదృష్టవశాత్తు కఠినచట్టాలున్నాయి. అభద్రతా కానీ, భావం ఇంకా వెంటాడుతోంది. సంప్రదాయాలు, సామాజిక అసమానతలతో మహిళలు పోరాడుతునే ఉన్నారు. ఏళ్ల తరబడి నాటుకు పోయిన సామాజిక భావనలు మహిళా సమానతకు అడ్డంకిగా మారుతున్నాయి. మార్పులు జరిగినా అసమానతలు పోవట్లేదు. మనమంతా ఆత్మపరిశీలన చేసుకొని పరిస్థితి మెరుగుపడటానికి ఏంచేయాలని ప్రశ్నించుకోవాల్సిన అవసరముంది. దేశప్రగతికి కీలకమే మహిళా భద్రత, గౌరవం. మహిళల మర్యాదను కాపాడేందుకు, రక్షణ కల్పించేందుకు మనమందరం బలమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande