అయోధ్య, 18 సెప్టెంబర్ (హి.స.)
అయోధ్య బాల రాముడికి కానుకల
పర్వం ఆగడం లేదు. విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసిన నాటి నుంచి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు స్వామి వారికి విలువైన కానుకలు పంపుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరానికి చెందిన రామ భక్తుడు చల్లా శ్రీనివాస రావు భక్తుల సహకారంతో 13 కిలోల వెండి, కేజీ బంగారంతో ధనస్సును తయారు చేయించాడు. ఈ మేరకు ఆయన బుధవారం ఆ ధనస్సుకు భద్రాచల ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ధనస్సును అయోధ్య బాల రాముడికి బహూకరించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..