హైదరాబాద్, 19 సెప్టెంబర్ (హి.స.)పశ్చిమ బెంగాల్ సీఎస్తో జూడాల చర్చలు
ఆర్జీ కర్ ఆసుపత్రి హత్యాచార వివాదానికి ముగింపు పలికే చర్యల్లో భాగంగా.. కోల్కతాలో గత కొన్నిరోజులుగా ఆందోళనలు చేస్తున్న జూనియర్ డాక్టర్లు (జూడాలు) రాష్ట్ర ప్రభుత్వంతో రెండోవిడత చర్చల నిమిత్తం బుధవారం సాయంత్రం ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్తో సమావేశమయ్యారు.
కోల్కతా: ఆర్జీ కర్ ఆసుపత్రి హత్యాచార వివాదానికి ముగింపు పలికే చర్యల్లో భాగంగా.. కోల్కతాలో గత కొన్నిరోజులుగా ఆందోళనలు చేస్తున్న జూనియర్ డాక్టర్లు (జూడాలు) రాష్ట్ర ప్రభుత్వంతో రెండోవిడత చర్చల నిమిత్తం బుధవారం సాయంత్రం ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్తో సమావేశమయ్యారు. ఈ చర్చల కోసం 30 మంది జూనియర్ వైద్యుల బృందం పోలీసు రక్షణతో సచివాలయానికి తరలివచ్చింది. రాత్రి 7.30కు మొదలైన సమావేశం పదింటిదాకా కొనసాగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు