వినాయక విగ్రహాల నిమజ్జనం ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స.) వినాయక చవితి ఉత్సవాలు మహానగరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రులు పూర్తి చేసుకున్న గణపయ్య ను నిమజ్జనం చేసేందుకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో వినాయక విగ్రహాల నిమజ్జనం ఏర్పాట్లపై సీఎం రేవ
సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష


హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స.)

వినాయక చవితి ఉత్సవాలు

మహానగరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రులు పూర్తి చేసుకున్న గణపయ్య ను నిమజ్జనం చేసేందుకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో వినాయక విగ్రహాల నిమజ్జనం ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హజరయ్యారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ సహా నగరంలో వినాయక నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన చెరువలు వివరాలను కమిషనర్ సీఎంకు వివరించారు. ఈ క్రమంలో.. నిమజ్జనాల పర్యవేక్షణ కోసం ట్యాంక్ బండ్, మండపాలు, చెరువుల దగ్గర మొత్తం 733 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి వాటి పై ప్రత్యేక దృష్టి కేంద్రికరించామని తెలిపారు. ఈ క్రమంలో వినాయక నిమజ్జనంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande