విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు ఇప్పించాలి.. మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి
మహబూబ్నగర్, 18 సెప్టెంబర్ (హి.స.) విద్యార్థులకు మోటివేషన్ క్లాస్ ఇప్పించాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి ఆదేశించారు. బాలానగర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్


మహబూబ్నగర్, 18 సెప్టెంబర్ (హి.స.)

విద్యార్థులకు మోటివేషన్ క్లాస్

ఇప్పించాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి ఆదేశించారు. బాలానగర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు శాతం తక్కువ ఉండడంతో దానిని పెంచాలని సూచించారు. 10వ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు.

మంచి మార్కులతో పాస్ కావాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు మోటివేషన్ క్లాస్ ఇప్పించాలని, కెరీర్ గైడెన్స్ క్లాసులను చెప్పించాలని, ప్రథమ శ్రేణి మార్కులతో పాసయ్యేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. రోగులకు అందుతున్న చికిత్సల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ధరణి రిజిస్ట్రేషన్ లను పరిశీలించారు. పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande