అమరావతి, 19 సెప్టెంబర్ (హి.స.)
ఈనాడు డిజిటల్ శ్రీకాకుళం, పలాస, నరసన్నపేట, : విజయవాడ వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి సమకూరిన విరాళాల చెక్కులను మంగళగిరిలో బుధవారం నిర్వహించిన సమావేశంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్లను కలిసి అందజేశారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ రూ.25 వేలు, ల్యాబ్ టెక్నీషియన్ సంక్షేమ సంఘం రూ.20 వేలు, డీసీసీబీ కాలనీ గణేష్ ఉత్సవ కమిటీ రూ.20 వేలు, అంబళ్లవానిపేటలోని సూర్య విద్యానికేతన్ రూ.42,761 చెక్కుల రూపంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్కు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల