అమరావతి, 18 సెప్టెంబర్ (హి.స.)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అడుగులు జనసేన పార్టీ వైపు పడుతున్నాయి.. ఇప్పటికే తన రాజీనామా లేఖలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి పంపిన బాలినేని.. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు.. ఇక, జనసేన పార్టీ నేతలతో టచ్లోకి వెళ్లారట బాలినేని.. రేపు విజయవాడలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో భేటీ కానున్నారట బాలినేని.. నిన్న జనసేన కీలక నేత నాగబాబుతో మంతనాలు కూడా జరిపారని తెలుస్తోంది.. గత కొద్దిరోజులుగా వైఎస్ జగన్ పై తీవ్ర అసంతృప్తిగా ఉన్న బాలినేని.. పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిపోయిందన్న అభిప్రాయంతో ఉన్నారట.. అందులో భాగంగానే ఇప్పటికే తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు పంపిన బాలినేని.. అయితే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో భేటీ అనంతరం జనసేనలో ఎప్పుడు చేరతారనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది..
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల