అమరావతి, 16 సెప్టెంబర్ (హి.స.)
ఇంటర్నెట్ డెస్క్: దుర్గ్-విశాఖపట్నం వందేభారత్ రైలును సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఇప్పటికే విశాఖపట్నం- సికింద్రాబాద్, భువనేశ్వర్- విశాఖపట్నం, సికింద్రాబాద్- విశాఖ మధ్య వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇది విశాఖపట్నం నుంచి ప్రయాణించే నాలుగోది అవుతోంది. రాయ్పుర్-విజయనగరం మార్గంలో ఇది మొదటిది. దుర్గ్-విశాఖపట్నం (20829) వందే భారత్.. దుర్గ్ నుంచి వారానికి 6 రోజులు(గురువారాలు మినహా) 05.45 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు 13.45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం-దుర్గ్ (20830) వందే భారత్ విశాఖపట్నం నుంచి వారానికి 6 రోజులు (గురువారాలు మినహా) 14.50 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు రాత్రి 22.50 గంటలకు దుర్గ్ చేరుకుంటుంది. ఈ నెల 20 నుంచి ఈ రైలు రెగ్యులర్గా తిరగనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల