వాషింగ్టన్, డి.సి., 23 ఏప్రిల్ (హి.స.)
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిని భారతదేశాన్ని మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ దాడిలో చాలా మంది పర్యాటకులు చనిపోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో మంత్రి అమిత్ షా కాశ్మీర్ చేరుకున్నారు. అలాగే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ట్రంప్ ఈ దాడిని ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ సమయంలో ప్రధాని మోదీకి, భారత ప్రజలకు అండగా నిలుస్తామన్నారు అమెరికా అధ్యక్షుడు. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా భారత్కు అండగా నిలిచారు. ఈ ఘటనకు కారణమైన వారికి శిక్ష పడాల్సిందే అన్నారు పుతిన్. భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడి పిరికిపంద చర్య అన్నారు రాహుల్ గాంధీ. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు సోనియా గాంధీ. ఇక ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, వైసీపీ అధినేత జగన్ కూడా దాడిని ఖండించారు. అటు తెలంగాణ సీఎం రేవంత్ ఉగ్రదాడిపై స్పందించారు. ఇలాంటి చర్యలతో భారతీయుల ఆత్మస్థైర్యం దెబ్బతీయలేరన్నారు. అటు కేసీఆర్, కేటీఆర్ కూడా చనిపోయినవారికి సంతాపం ప్రకటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి