దిల్లీ, 1 మే (హి.స.): దేశంలోని మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 17 మంది కోటీశ్వరులని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ వెల్లడించింది. లోక్సభలోని 75 మంది మహిళా ఎంపీలలో ఆరుగురు, 37 మంది రాజ్యసభ సభ్యురాళ్లలో ముగ్గురు, వివిధ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభల్లోని 400 మంది మహిళా ఎమ్మెల్యేల్లో 8 మంది బిలియనీర్లని ఏడీఆర్ విశ్లేషించింది. దేశంలోని చట్టసభల్లో మొత్తం 513 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరి మొత్తం ఆస్తి విలువ రూ. 10,417 కోట్లు. అంటే సరాసరిన ఒక్కొక్కరికీ రూ. 20.34 కోట్ల ఆస్తి ఉన్నట్టు లెక్క అని ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన సభ్యురాళ్లు ఈ విషయంలో అగ్రభాగాన ఉన్నారు. సరాసరిన వీరి ఆస్తి విలువ రూ.74.22 కోట్లు. దాద్రా నగర్హవేలీలో ఒకే ఒక సభ్యురాలు ఉండగా ఆమె మొత్తం ఆస్తి విలువ రూ.71.44 కోట్లు. హరియాణాలోని 15 మంది చట్టసభల సభ్యురాళ్ల సరాసరి ఆస్తి విలువ రూ.63.72 కోట్లు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల