హైదరాబాద్, 11 మే (హి.స.)ఉగ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యంతోనే ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) చేపట్టామని భారత సైన్యం వెల్లడించింది. తాము చేపట్టిన ఆపరేషన్లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపింది. దాడుల భయంతో ఉగ్రశిబిరాలు ఖాళీ అవుతున్నాయని పేర్కొంది. పహల్గాంలో 26 మంది అమాయకులను ముష్కరులు పొట్టనపెట్టుకున్నారని భారత సైన్యం (Indian Army) వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్కు సంబంధించి త్రివిధ దళాల అధికారులు మీడియా సమావేశంలో కీలక వివరాలు వెల్లడించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో 5, పాక్లోని 4 ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసినట్లు తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు