న్యూఢిల్లీ, 14 మే (హి.స.)
పాకిస్తాన్కు మరో బిగ్ షాక్ తగిలింది. గత కొంతకాలంగా తమను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని పాక్ పై పోరాటం చేస్తున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ.. స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. కాగా, తమ సహజ వనరుల దోపిడీ, రాజకీయ హక్కుల ఉల్లంఘన, పాక్ సైన్యం చేస్తున్న అణచివేతలపై బలూచ్ కొన్నేళ్లుగా ప్రజలు ఆందోళన చేస్తున్నారు. తమ హక్కుల కోసం బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ ఉద్యమంలో ప్రముఖ సాయుధ సంస్థగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఈరోజు స్వతంత్ర దేశంగా అవతరించినట్లు ప్రకటించుకుంది. అలాగే, నూతన ప్రభుత్వ ఏర్పాటుకు తాము కసరత్తు చేస్తున్నామని క్వెట్టాలో కొత్త పార్లమెంట్ కు ఫోటోలు, జాతీయ చిహ్నం, జాతీయ గీతానికి సంబంధించిన వీడియోలను బలూచిస్తాన్ రిలీజ్ చేసింది. అలాగే, భారత్ సహా ఇతర దేశాలు తమ కొత్త బలూచిస్తాన్ దేశానికి వచ్చి ఎంబసీలను ఏర్పాటు చేయాలని కోరింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..