పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే…
ముంబై, 28 మే (హి.స.)మన దేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్‌ ఎక్కువే.. ఇక పండుగలు, పెళ్లిళ్లు, ప్రత్యేక రోజులు ఇలా శుభకార్యం ఏదైనా సరే..చాలా మంది గోల్డ్‌ కొనుగోలు చేస్తుంటారు. అందుకే ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకుంటున్న రెండో దేశంగా భారత్
Gold


ముంబై, 28 మే (హి.స.)మన దేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్‌ ఎక్కువే.. ఇక పండుగలు, పెళ్లిళ్లు, ప్రత్యేక రోజులు ఇలా శుభకార్యం ఏదైనా సరే..చాలా మంది గోల్డ్‌ కొనుగోలు చేస్తుంటారు. అందుకే ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకుంటున్న రెండో దేశంగా భారత్ రికార్డులు సృష్టిస్తోంది. అయితే, ఇటీవలి కాలంలో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి.. పసిడి ధర గణనీయంగా పెరుగుతూ రికార్డ్ స్థాయికి చేరుకుంది. దాంతో సామాన్య మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ, గత కొన్ని రోజులుగా మళ్లీ బంగారం ధరలు నేల చూపులు చూస్తు్న్నాయి. మెల్లి మెల్లిగా పసిడి పరుగులు తగ్గించుకుంటూ కిందకు దిగి వస్తోంది. ఈ క్రమంలో మే 28వ తేదీన భారత్‌లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఓ సారి పరిశీలిద్దాం..

భారతదేశం బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో తగ్గాయి. ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము రూ. 9,747లు కాగా, అదే 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము రూ.8,934లుగా ఉంది. ఇకపోతే, 18 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము రూ.7,310లుగా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.87,690, 24 క్యారెట్ల ధర రూ.95,650 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.87,540, 24 క్యారెట్ల ధర రూ.95,500 గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.87,540, 24 క్యారెట్ల రేటు రూ.95,500 గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.87,540, 24 క్యారెట్ల ధర రూ.95,500 గా ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,540, 24 క్యారెట్ల ధర రూ.95,500 గా 4ఉంది.

విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,340, 24 క్యారెట్ల ధర రూ.97,470 గా ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande