తెలంగాణ, ఖమ్మం. 31 మే (హి.స.) యువతలో చెడు అలవాట్లు దూరం
చేయటానికి తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యతతో వ్యవహరించాలని ఖమ్మం జిల్లా మధిర కోర్టు సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ ఎన్.ప్రశాంతి అన్నారు. శనివారం ప్రపంచ పొగాకు నిర్మూలన దినోత్సవం సందర్భంగా మధిర పురపాలక సంఘంలో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ అధ్యక్షత వహించిన ఈ సదస్సుకు ఆమె హాజరై మాట్లాడారు. యువత పొగాకు నమలడం గానీ, పొగ సేవించడం గానీ, పొగాకు ఉత్పత్తులను నమలడం చేయకూడదన్నారు. ఎలక్ట్రానిక్ సిగరెట్లు తాగడం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.
తల్లిదండ్రులు జాగ్రత్తతో వ్యవహరించి యువతలో చెడు వ్యసనాలను ముందుగా గుర్తించాలన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు