సంక్షేమంతో పాటు,సామాజిక న్యాయం ప్రజా ప్రభుత్వం తోనే సాధ్యం : మంత్రి తుమ్మల
తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 2 జూన్ (హి.స.) జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వేడుకలను జిల్లా కేంద్రం కొత్తగూడెంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఐ డి ఓ సి కార్యాలయం లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి,
మంత్రి తుమ్మల


తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 2 జూన్ (హి.స.)

జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వేడుకలను జిల్లా కేంద్రం కొత్తగూడెంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఐ డి ఓ సి కార్యాలయం లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందరాన్ని స్వీకరించారు. కొత్తగూడెం ప్రగతి మైదానంలో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం శాసనసభ్యులు సాంబశివరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం మంత్రి తుమ్మల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ. సంక్షేమంతో పాటు,సామాజిక న్యాయం ప్రజా ప్రభుత్వం తోనే సాధ్యం అన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. అనంతరం రవాణా శాఖ, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, పశుసంవర్ధక శాఖ, అగ్నిమాపక శాఖ వైద్యశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన శకటాలు ప్రదర్శించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande