తెలంగాణ, మెదక్. 2 జూన్ (హి.స.)
తెలంగాణ అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలుస్తుందని, బంగారు, ఆర్థిక, సామాజిక తెలంగాణ దిశగా సమన్వయంతో ముందుకు పోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు కే. కేశవరావు పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి సమీకృత కలెక్టరేట్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాధించిన ఘనతను నలుదిక్కులా చాటేలా, ప్రత్యేక రాష్ట్రం ద్వారా ప్రజల జీవితంలో వచ్చిన మార్పు తెలియజేసేలా ఘనంగా రాష్ట్ర దశాబ్ది వేడుకలను నిర్వహించు కుంటున్నందుకు సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రాముఖ్యతను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెల్లో వివరిస్తూ ఉద్యమకారులు ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం, ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాల ఫలితంగా దశాబ్దాల కల నెరవేరిందని గుర్తు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు