సేంద్రియ పద్దతుల్లో వ్యవసాయ సాగు విదానాలను అవలంభిస్తే అధిక దిగుబడులు.. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు.
తెలంగాణ, పెద్దపల్లి. 1 జూన్ (హి.స.) మారుతున్న పరిస్థితులకనుగుణంగా ఆధునిక పద్దతులను అవలంభిస్తూ సేంద్రియ పద్దతుల్లో వ్యవసాయ సాగు విదానాలను అవలంభిస్తే అధిక దిగుబడులతో కూడిన లాభాలు వస్తాయని రామగిరి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్
వ్యవసాయ శాస్త్రవేత్తలు


తెలంగాణ, పెద్దపల్లి. 1 జూన్ (హి.స.)

మారుతున్న పరిస్థితులకనుగుణంగా ఆధునిక పద్దతులను అవలంభిస్తూ సేంద్రియ పద్దతుల్లో వ్యవసాయ సాగు విదానాలను అవలంభిస్తే అధిక దిగుబడులతో కూడిన లాభాలు వస్తాయని రామగిరి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. ఆదివారం పెద్దపల్లి మండలంలో బ్రాహ్మణపల్లి, రాగినేడు, కానగర్తి గ్రామాల్లో వ్యవసాయ శాఖ, KVK రామగిరి ఖిల్లా ఆధ్వర్యం లో వికాసిత్ కృషి సంకల్ప్ అభియాన్లో భాగంగా ముందస్తు ఖరీఫ్ రైతు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డా. కిరణ్, నరేష్ హైదరాబాద్ ఐసిఏఆర్ (icar) ప్రధాన శాస్త్రవేత్తలు డా.ముత్తు కుమార్, డా.యోగేష్, డా. పాల్ యాదవ్, సీనియర్ శాస్త్రవేత్త ఎన్ఎన్ఆర్ఎ, పౌల్ట్రీ రీసెర్చ్ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతు సోదరులు ఖరీఫ్ సీజనికి సిద్ధంగా ఉండాలని, వివిధ పంటలు కొత్త వంగడాలు గురించి రైతులకు వివరించారు. అలాగే సహజ వ్యవసాయ సాగు పద్ధతులు, ముందస్తు సాగు విధానం గురించి ప్రత్యేకంగా వివరించారు. అధీకృత విత్తన షాపుల్లోనే విత్తనాలు కొనుగోళ్లు చేయాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande