అమరావతి, 1 జూన్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ ) రాష్ట్రంలో ఆదివారం రేషన్ షాపుల ) ద్వారా సరుకుల పంపిణీ ఓ పండుగలా ప్రారంభమైందని ప్రజలు పదిహేను రోజుల పాటు తమకు నచ్చిన సమయాల్లో సరుకులు తీసుకోవచ్చునని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ( పేర్కొన్నారు. రేషన్ సరుకుల పంపిణీలో భాగంగా ఎమ్మెల్యే పటమట జెడీ నగర్లో ప్రజలకు రేషన్ సరుకులు పంపిణీ చేశారు. ఓ దివ్యాంగురాలి ఇంటికి వెళ్లి ఆయన స్వయంగా బియ్యం, పంచదార అందచేశారు. గద్దె రామ్మోహన్ వెంట కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, ఎయస్వో శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ