డబుల్ బెడ్ రూమ్ లను కేటాయించాలంటూ బిజెపి నాయకుల ధర్నా..
తెలంగాణ, మేడ్చల్ మల్కాజ్గిరి. 1 జూన్ (హి.స.) స్థానికులకు 10 శాతం డబుల్ బెడ్ రూములు కేటాయిస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ప్రతాప్ సింగారంలో బీజేపీ ఘట్కేసర్ నాయక
బిజెపి ధర్నా


తెలంగాణ, మేడ్చల్ మల్కాజ్గిరి. 1 జూన్ (హి.స.)

స్థానికులకు 10 శాతం డబుల్ బెడ్

రూములు కేటాయిస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ప్రతాప్ సింగారంలో బీజేపీ ఘట్కేసర్ నాయకుల ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూమ్ బాధితులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కూడా చాలాసార్లు డబుల్ బెడ్ రూమ్ ల కోసం స్థానిక ప్రజలు ఆందోళన కార్యక్రమం చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు.

అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ కేటాయించే విషయంలో స్థానిక అధికారులు ఎవరు కూడా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమానికి ఎంపీ ఈటల రాజేందర్ వస్తారని తెలిపారు. ప్రభుత్వం అధికారులు ఇప్పటికైనా స్పందించకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande