అమరావతి, 1 జూన్ (హి.స.)షర్మిష్ఠ పనోలీ (Sharmishtha Panoli) అనే 19 ఏళ్ల యువతి ‘ఆపరేషన్ సిందూర్’ గురించి ఆమె ఇన్స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. కాగా ఆ వీడియోకు ‘ఎలాంటి కారణం లేకుండా పాక్పై భారత్ దాడులు చేసింది’ అంటూ ఒక పాకిస్తాన్ అమ్మాయి కామెంట్ చేసింది. దీంతో కోపంగా రియాక్ట్ అయిన షర్మిష్ఠ.. ‘పహల్గాం దాడి, ఉగ్రవాదులకు పాక్ ఇస్తున్న సపోర్ట్ గురించి ఎప్పుడూ వినలేదా?’ అని ప్రశ్నించింది. అక్కడితో ఆగకుండా కొన్ని మతపరమైన వ్యాఖ్యలు (Religious comments) కూడా చేసింది. అనంతరం ఆమె వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవ్వగా.. తన వీడియో ని రిమూవ్ చేయడం తో పాటు క్షమాపణలు కూడా చేసింది.
కానీ అప్పటికే ఆమె వీడియో వైరల్గా మారడంతో.. ఆమెపై కోల్కతాలో కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 1500 కిలోమీటర్లు ప్రయాణించి ఆమెను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) షర్మిష్ఠ పనోలీ అరెస్ట్ పై స్పందిస్తూ.. పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. పవన్ తన ట్వీట్లో షర్మిష్ఠ పనోలీ వీడియో వల్ల కొంతమందికి బాధాకరమైన, హానికరమైన విషయం జరిగింది. ఆమె తన తప్పును ఒప్పుకొని, వీడియోను తొలగించి, క్షమాపణ చెప్పింది. కానీ పశ్చిమ బెంగాల్ పోలీసులు (Bengal Police)చర్యలు తీసుకుని, శర్మిష్ట పై చర్యలు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి