ఢిల్లీ పెత్తనాన్ని ఎప్పటికీ అనుమతించం..ఎంకే స్టాలిన్‌
చెన్నై: 13 జూన్ (హి.స.) ఢిల్లీ నుండి రాష్ట్రంపై పెత్తనం చెలాయించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) పేర్కొన్నారు. సేలంలోని మోహన్‌కుమారమంగళం ప్రభుత్వ వైద్యకళాశాల మైదానంలో గ
ఢిల్లీ పెత్తనాన్ని ఎప్పటికీ అనుమతించం..ఎంకే స్టాలిన్‌


చెన్నై: 13 జూన్ (హి.స.) ఢిల్లీ నుండి రాష్ట్రంపై పెత్తనం చెలాయించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) పేర్కొన్నారు. సేలంలోని మోహన్‌కుమారమంగళం ప్రభుత్వ వైద్యకళాశాల మైదానంలో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన సభలో రూ.880 కోట్లతో నిర్మించనున్న జౌళి పార్కుకు, రూ.100 కోట్లతో నిర్మించనున్న కొత్త గ్రంథాలయ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. రూ.225 కోట్లతో పూర్తయిన పథకాలకు ప్రారంభోత్సవం చేసిన ఆయన 1,01,203 మంది లబ్ధిదారులకు సహాయాలు పంపిణీ చేశారు.

ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇటీవల మదురైలో పర్యటించిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలకు విడుదలయ్యే నిధులను మళ్లించి రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఖర్చు చేస్తున్నట్లు అసత్య ఆరోపణలు చేశారని, వాస్తవానికి కేంద్రం అమలు చేస్తున్న తాగునీటి పథకం, ప్రధాని ఆవాస్‌ యోజన పథకం తదితర పధకాలకు నిధులు చాలకపోతే తమ ప్రభుత్వమే 50 శాతం నిధులు సమకూర్చి ఆ పథకాలను పూర్తి చేస్తోందని, ఈ చేదు నిజం అమిత్‌షాకు తెలియకపోవటం గర్హనీయమన్నారు. మదురైలో రోజంతా పర్యటించిన అమిత్‌షాకు అక్కడ ఎయిమ్స్‌ ఆస్ప త్రి నిర్మాణ పనులు ఎలా నత్తనడకన జరుగుతున్నాయో తెలియకపోవటం శోచనీయమన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande