అమరావతి, 13 జూన్ (హి.స.)
అమరావతి: భౌగోళిక వారసత్వ జాబితాలో ప్రఖ్యాత బెలూం గుహలకు గుర్తింపు దక్కడంపై పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలోని బెలూం గుహలకు జీఎస్ఐ ప్రత్యేక గుర్తింపునివ్వడం సంతోషకరమన్నారు. పురాతన సంస్కృతికి నిలయాలు ఈ బెలూం గుహలని పేర్కొన్నారు.
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటనతో పర్యాటకంగా ఈ ప్రాంతానికి మరింత ప్రాచుర్యం లభిస్తుందని మంత్రి తెలిపారు. జీఎస్ఐ జాబితాలో చోటు దక్కడం వల్ల బెలూం గుహలు మరింత అభివృద్ధికి నోచుకోనున్నాయన్నారు. ప్రపంచంలో రెండోది, దేశంలోనే పొడవైన అంతర్భాగ గుహలుగా బెలూం గుహలు ప్రసిద్ధి చెందాయని వ్యాఖ్యానించారు. దేశ పర్యాటక ప్రదేశాల్లో రాష్ట్రంలోని బెలూం గుహలకు స్థానం దక్కుతుందని అన్నారు. విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా మరింత ప్రచారం కల్పిస్తామని తెలిపారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోందని మంత్రి దుర్గేష్ అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ