అమరావతి, 13 జూన్ (హి.స.)
జమ్మలమడుగు గ్రామీణ, 1925 ఫిబ్రవరి 3న దేశంలో తొలి విద్యుత్తు రైలు పరుగులు తీసింది. ఫిబ్రవరి 2025 నాటికి శత వసంతాలు పూర్తిచేసుకుంది. ఈ వందేళ్ల ప్రస్థానంలో బొగ్గు నుంచి వందే భారత్ వరకు భారతీయ రైల్వే అనేక మార్పులకు లోనైంది. తాజాగా ప్రయాణికులకు మెరుగైన అనుభూతి, ఆహ్లాదం కల్పించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా ఇంజిన్లపై పర్యాటక ప్రాంతాల చిత్రాలను ముద్రించింది. ఇందులో ప్రఖ్యాత సందర్శనీయ స్థలమైన గండికోట పెన్నాలోయ చిత్రానికి కూడా చోటు దక్కించుకుంది. ఈ చిత్రాలు నెట్టింట వైరల్ అవుతుండటంతో ఈ ప్రాంత వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ