ఈ నెల.8,9,10. తేదీల్లో తాడిపత్రిలో.జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో జమ్మలమడుగు కు చెందిన చిన్నారి బంగారు.పథకం
జమ్మలమడుగు, 13 జూన్ (హి.స.) , ఈ నెల 8, 9, 10వ తేదీల్లో తాడిపత్రిలో జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో జమ్మలమడుగుకు చెందిన చిన్నారి బంగారు పతకం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. జమ్మలమడుగు నుంచి ఎనిమిది మంది పోటీల్లో పాల్గొనగా తిలోక్ష బంగా
ఈ నెల.8,9,10. తేదీల్లో తాడిపత్రిలో.జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో  పోటీల్లో జమ్మలమడుగు కు చెందిన చిన్నారి బంగారు.పథకం


జమ్మలమడుగు, 13 జూన్ (హి.స.)

, ఈ నెల 8, 9, 10వ తేదీల్లో తాడిపత్రిలో జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో జమ్మలమడుగుకు చెందిన చిన్నారి బంగారు పతకం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. జమ్మలమడుగు నుంచి ఎనిమిది మంది పోటీల్లో పాల్గొనగా తిలోక్ష బంగారు పతకం, పోషిత, సైఫున్నీసా కాంస్య పతకాన్ని దక్కించుకున్నారు. గత నెల 28వ తేదీన పోరుమామిళ్లలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లోనూ ఈ చిన్నారి బంగారు పతకాన్ని సాధించింది. ఈ నెల 22, 23 తేదీల్లో ఉత్తరాఖండ్‌ రాష్ట్రం హరిద్వార్‌లో జరిగే జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు అర్హత సాధించినట్లు మాస్టర్‌ రంగస్వామి గురువారం తెలిపారు. మొదటి రౌండ్‌లో తూర్పుగోదావరి, రెండో రౌండ్‌లో అనంతపురం క్రీడాకారిణులపై గెలిచినట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande