ప్రతిరోజు యోగ చేయడం వలన బీపీ, షుగర్ వ్యాధులను అదుపులో ఉంచుకోవచ్చు.. జిల్లా కలెక్టర్ ములుగు
ములుగు, 13 జూన్ (హి.స.) ప్రతిరోజు ఉదయం యోగాసనాలు చేయడం వల్ల మెరుగైన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందవచ్చని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తుగా న
ములుగు జిల్లా కలెక్టర్


ములుగు, 13 జూన్ (హి.స.) ప్రతిరోజు ఉదయం యోగాసనాలు చేయడం వల్ల మెరుగైన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందవచ్చని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తుగా నిర్వహిస్తున్న దశాబ్దపు ఉత్సవాలలో భాగంగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. జిల్లా లోని వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్, ఇతర కార్యాలయ సిబ్బందికి జిల్లా ఆయుష్ శాఖ అధ్వర్యంలో యోగ శిక్షకుల చే శిక్షణ నిర్వహించారు.

కలెక్టర్ జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి యోగ శిక్షకుల ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిత్య జీవితంలో ప్రజలందరూ, అధికారులందరూ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ తమ ఆరోగ్యం కోసం కూడా తప్పకుండా కొంత సమయాన్ని కేటాయించి యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ప్రతిరోజు యోగ చేయడం వలన బీపీ, షుగర్ వ్యాధులను అదుపులో ఉంచుకోవచ్చని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande