హైదరాబాద్, 13 జూన్ (హి.స.)
అహ్మదాబాద్, 13 జూన్ (హి.స.)అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిరిండియా విమానం గురువారం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ విమాన ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. వైద్య కళాశాల సముదాయంపై విమానం పడిపోవడంతో అక్కడ మరో 24 మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ దుర్ఘటన నేపథ్యంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అహ్మదాబాద్కు చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అధికారుల నుంచి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు