ముంబయి: 13 జూన్ (హి.స.) దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమనడంతో అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపైనా పడింది. దీంతో ప్రారంభంలోనే సెన్సెక్స్ 1000 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 24,600 దిగువన ట్రేడింగ్ మొదలుపెట్టింది.
ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 920 పాయింట్ల నష్టంతో 80,782 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ (Nifty) 279 పాయింట్ల నష్టంతో 24,608 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో అన్ని షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఎల్అండ్టీ, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, పవర్గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫిన్సర్వ్, ఎంఅండ్ఎం, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐ, టాటా మోటార్స్ షేర్లు ప్రధానంగా నష్టాల్లో కదలాడుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 86.15 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 75.80 డాలర్ల వద్ద.. బంగారం ఔన్సు 3,451 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు