జెరూసలేం, 13 జూన్ (హి.స.)ఇజ్రాయెల్, ఇరాన్(Israel, Iran) మధ్య యుద్ధం జరుగుతోంది. దీంతో ఇరు దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
ఈ మేరకు ఇరాన్ వాయువ్య మార్గంపై సంచలన నిర్ణయం తీసుకుంది. తన గగనతలాన్ని మూసిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఎయిర్ సంచలన నిర్ణయం తీసుకుంది. పలు విమానాలను దారి మళ్లింది. మరికొన్ని విమానాలను తిరిగి వెనక్కి పిలిపించింది. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
దారి మళ్లింపు, తిరిగి వెనక్కి వచ్చిన విమానాల వివరాలను ప్రకటించింది. ప్రయాణీకుల అసౌకర్యానికి తాము చింతిస్తున్నామని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు.
ప్రయాణీకులకు వసతి కల్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రయాణాన్ని రద్దు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నామని, రీ ఫండ్ సైతం ఇస్తామని వెల్లడించారు. అంతేకాదు వారిని గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి