
యూపీ, 18 జూన్ (హి.స.)
రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు వ్యక్తులు మృతి చెందిన సంఘటన యూపీ బులంద్హర్ జిల్లాలో జరిగింది. బుదౌన్లో జరిగిన పెళ్లి వేడుకకు వెళ్లి.. తిరిగి వస్తున్న క్రమంలో బుధవారం తెల్లవారుజామున 5.30 నిమిషాలకు ఈ దుర్ఘటన చోటుచేసుకున్నది. హైవేపై ఉన్న కల్వర్టును కారు ఢీకొన్న ప్రమాదంలో మంటలు అంటుకున్నట్లు పోలీసులు చెప్పారు. డ్రైవర్ నిద్రమత్తులోకి వెళ్లడం వల్ల ప్రమాదం జరిగిందని వెల్లడించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..