హైదరాబాద్, 27 జూన్ (హి.స.)
అన్నపూర్ణ భోజన కేంద్రాల పేరును ఇందిరా క్యాంటిన్గా మార్చాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తప్పు పట్టారు. ఈ పేరు మార్పు హిందూ విశ్వాసాలకు అవమానమని అన్నారు. హైదరాబాద్లో 5 రూపాయలకే మీల్స్ పథకం అన్నపూర్ణ భోజన కేంద్రాల పేరును ఇందిరా క్యాంటిన్ గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ మార్పుకు హామీ ఇచ్చిందని, కానీ 18 నెలల్లో అది చేసింది కేవలం పేరు మార్పు మాత్రమే.. అని విమర్శించారు. విశ్వవిద్యాలయాలు పేరు మార్చింది, ఆసుపత్రులు, నీటిపారుదల ప్రాజెక్టులు, అవార్డుల పేరు,ఫ్లైఓవర్ల పేరు, గృహ నిర్మాణ పథకం పేరు, వ్యవసాయ రుణ ప్రోత్సాహకాల పేరు, హరితహారం కార్యక్రమం పేరు, విభాగాల పేర్లు, అధికారిక నివాసం పేరు, తెలంగాణ తల్లి మారింది అని పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్